తెలంగాణ అంశం: చంద్రబాబుపై సీమాంధ్ర ఎమ్మెల్యేల ఒత్తిడి

అయితే తీర్మానానికి చంద్రబాబు ఏమాత్రమూ సుముఖంగా ఉండడని, కాబట్టి బాబుపై ఒత్తిడి తీసుకు వచ్చి అయినా తీర్మానం ప్రవేశ పెట్టాలని వారు యోచిస్తున్నారు. సీమాంధ్ర ఎంపీలు ఒత్తిడి మేరకు చంద్రబాబు తీర్మానానికి సరే అంటే ఆయన ఇరుక్కు పోతారు. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడితే మా పార్టీ మద్దతు ఉంటుందని ఆయన గతంలో ప్రకటించారు. తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత పార్టీ మద్దతు ప్రకటించకుంటే ఇప్పటికే తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన టిడిపికి మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంగా చంద్రబాబు తీర్మానానికి మొగ్గు చూపకపోవచ్చు కూడా.












Click it and Unblock the Notifications