లక్షా 28వేల కోట్లతో వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రతిపాదించిన ఆనం

రాష్ట్రంలో నాలుగు సార్లు భారీ వర్షాలు, తుఫాను వచ్చినా వ్యవసాయంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి సాధించామని ఆయన చెప్పారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, వైయస్సార్ అభయ హస్తం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. జలయజ్ఞానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 15,040 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయితీ బియ్యం పథకానికి 2500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. పనిదినాలను వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications