హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే కొండా సురేఖ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్‌: మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యురాలు కొండా సురేఖ మండిపడ్డారు. జగన్ దీక్ష చేస్తున్నారా, ఎక్కడ అని మంత్రి బొత్స సత్యనారాయణ అనడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పాదయాత్ర అనంతరం ఆమె బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బొత్స సత్యనారాయణ ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తుంటే మిగతా మంత్రులు పగలబడి నవ్వుతున్నారని ఆమె అన్నారు. లక్షలాది మంది వైయస్ జగన్‌కు మద్దతు తెలుపుతుంటే వైయస్ జగన్ దీక్ష మంత్రులకు కనపించలేదని అనడం సరి కాదని ఆమె అన్నారు.

జగన్ దీక్షను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. వైయస్ జగన్ దీక్షపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులపై, వైయస్ జగన్‌పై, వైయస్ జగన్ వర్గంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సురేఖ పాదయాత్ర సందర్భంగా అన్నారు. ఓ ప్రతినిధిని పంపి దీక్ష విరమించాలని కోరే కనీస సంప్రదాయాన్ని కూడా ప్రభుత్వం పాటించడం లేదని, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆమె అన్నారు.

English summary
Ex MP YS Jagan camp Congress MLA Konda Surekha lashed ou at Minister Botsa Satyanarayana for insulting YS Jagan's fast. She said that Government is neglecting YS Jagan fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X