తెలంగాణకు మద్దతుగా సమైక్యాంధ్రుల దీక్ష, ప్రారంభించిన కోదండరామ్

వారికి కావాల్సిన రక్షణ మేం కల్పిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సీమాంధ్రనుండి వచ్చి ఇక్కడ బతుకుతున్న వారి సమస్యలను చర్చించడానికి మేం సిద్ధం అని ప్రకటించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ తమ ఆస్తులను కాపాడుకోవడానికే సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారన్నారు. సీమాంధ్రులు కూడా చాలామంది తెలంగాణకు వ్యతిరేకంగా ఏమీ లేరని చెప్పారు. కాగా తెలంగాణ వచ్చాక కూడా తాము ఇక్కడే ఉంటామని దీక్ష చేపట్టిన సీమాంధ్రులు అన్నారు. మేం సీమాంధ్రులమే కానీ, సమైక్యవాదులం మాత్రం కాదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications