హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో భయాందోళలు: జెసి దివాకర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ వివాదం మొత్తం రాజధాని హైదరాబాద్ అంశంపైనే కేంద్రీకృతం అయి ఉందని మాజీ మంత్రి, అనంతపురం శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. జెసి దివాకర్ రెడ్డి సిఎల్పీలో తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలను తెలంగాణ ఎమ్మెల్యేలకు చెప్పారు. హైదరాబాద్ విషయంలో శ్రీకృష్ణ కమిటీ సరియైన రీతిలో అభిప్రాయాలు సేకరించలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను తెలంగాణలో ఉంచాలా వద్దా అనే విషయంలో హైదరాబాదీల అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీ సమర్థవంతంగా తీసుకోలేదని ఆయన తన అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రస్తుత సమస్య అంతా హైదరాబాద్ అన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల ఆస్తుల రక్షణకు సరైన విశ్వాసం కల్పించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖరరావు నినాదాలతో సీమాంధ్రులలో భయాందోళనలు నెలకొంటున్నాయన్నారు. సీమాంధ్రుల ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. అనవసరంగా ప్రజల మధ్య విభేదాలు రగిలించవద్దని సూచించారు.

English summary
Congress Senior MLA JC Diwakar Reddy said seemandhra people afraid of KCR comments. He suggested don't make difference in Telangana and Seemandhra people. He participated in Telangana Congress MLAs meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X