హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చి 1వ తేదీన 24 గంటల పాటు రైల్ రోకో: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ మార్చి 1వ తేదీన తెలంగాణలో 24 గంటలపాటు రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. పల్లె పల్లె పట్టాలపైకి పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రైల్ రోకో కార్యక్రమంతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అనివార్యతలో కేంద్రం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైల్ రోకో కార్యక్రమం ముగిసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.

మార్చి 1వ తేదీ రైల్ రోకో ముగిసిన తర్వాత హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ఈజిప్టులోని తెహ్రీర్ స్క్వేర్ ఉద్యమాన్ని మరిచిపోయేలా ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఉద్యమం తర్వాత అందరూ ఈజిప్టు తరహా అనడం మానేస్తారని, తెలంగాణ తరహా అని అంటారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణను కొనసాగిస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారని, అంతగా ముందుకు వస్తున్న వారికి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శుక్రవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి కెసిఆర్, విజయశాంతి గురువారం హైదరాబాదు చేరుకున్నారు. మార్చి 1వ తేదీ తర్వాత వారు లోకసభను స్తంభింపజేయడానికి తిరిగి ఢిల్లీ వెళ్తారు.

English summary
Telangana JAC chairman Kodnadaram called upon people to make success rail roko on March 1, demanding the 
 
 formation of Telangana state. He said taht after march 1, they will takeup chalo Hyderabad and it will be like Egypt 
 
 movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X