వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాసనసభలో ఈ రోజూ అదే తంతు, తెలంగాణ అంశంపై వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శాసనసభ సమావేశాల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. తెలంగాణ అంశంపై శనివారం కూడా శాసనసభా సమావేశాలు స్తంభించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో సభను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలుత 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు.

సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెరాస సభ్యులు తమ పట్టు వీడలేదు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. నాదెండ్ల మనోహర్ ఎంతగా సర్ది చెప్పినప్పటికీ వారు వినలేదు. దీంతో సభను డిప్యూటీ స్పీకర్ రెండో సారి అర గంట పాటు వాయిదా వేశారు. ఈ నెల 17వ తేదీన సభా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

గవర్నర్ నరసింహన్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో తీవ్రమైన ఆందోళన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెరాస శాసనసభ్యులను సస్పెండ్ చేసి సభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్‌ను ప్రతిపాదించానని అనిపించారు. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించే వరకు సభను కొనసాగనివ్వబోమని తెరాస ఇప్పటికే ప్రకటించింది. కాగా, తెలంగాణ ప్లకార్డులతో కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు.

English summary
Impasse in Assembly proceddings continued saturday also. As TRS MLAs stalled procedings Deputy Speaker Nadendla Manohar adjourned Assembly twice. Congress Telangana MLAs stage protest with Telangana placards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X