అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెల్లెలి ప్రియుడిని గొడ్డలితో నరికిన అన్న: చెల్లెలి పరిస్థితి విషమం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantapur District
అనంతపురం: తన చెల్లెలు మరో కులానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమిస్తుందనే కారణంతో ఓ అన్నయ్య బాయ్‌ఫ్రెండ్‌ను గొడ్డలితో నరికిన ఘోర సంఘటన అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం నర్సింపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నర్సింపల్లి గ్రామానికి చెందిన జయచంద్ర, సుమతి అనే ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలకు వారు ప్రేమ విషయం తెలిసి వారిని హెచ్చరించారు. ఇరువురివి వేరు వేరు కులాలని, వారి ప్రేమ ఫలించదని, ప్రేమను మరిచి పోవాలని ఇరు కుటుంబాల వారు హెచ్చరించారు.

అయినప్పటికీ సుమతి, జయచంద్ర కలవడం మానలేదు. శనివారం సాయంత్రం సమయంలో సుమతి ఇంటి దగ్గర మరోసారి జయచంద్ర, సుమతిలు కలిసుకున్నారు. దీనిని గమనించిన సుమతి అన్న ఆవేశంతో గొడ్డలిని తీసుకొని వారిని నరికాడు. ఆ తర్వాత అతడు అక్కడినుండి పరారయ్యాడు. సుమతి, జయచంద్ర పరిస్థితి గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే జయచంద్ర అప్పటికి మరణించగా, సుమతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Unable to digest the fact that his sister was in love with a boy from different caste, brother of the girl axed her boyfriend Jayachandra, 22, to death at narsimpalli village in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X