నగదు బదిలీ ద్వారా సబ్సిడీలు, ప్రత్యక్ష పన్నులు సరళతరం: ప్రణబ్

Pranab Mukherjee
న్యూఢిల్లీ: పేదలకు కిరోసిన్, వంటగ్యాస్, ఎరువుల సబ్సిడీలను నగదు బదిలీ ద్వారా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఈ విషయం చెప్పారు. 2012 ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పన్నుల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తున్నామని, పన్నుల విధానాన్ని సరళతరం చేసేందుకు చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. టోకు, రిటైల్ ధరల మధ్య తేడాను తగ్గిస్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది 40 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని ఆయన చెప్పారు.

మహిళా స్వయం సహాయక గ్రూపులకు అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ గృహ నిర్మాణ నిధిని 3 వేల కోట్లకు పెంచుతామని ఆయన చెప్పారు. కొత్త బ్యాంకుల అనుమతికి మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రతిపాదించడం ప్రారంభించగానే సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగింది. రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తే రైతులకు 3 శాతం రాయితీ ఇస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+