హైదరాబాదు నుంచి సీమాంధ్రులను తరిమికొడ్తాం: కెటిఆర్
కలిసి ఉండాలనే బలవంతపు ఆరాటాన్ని సీమాంధ్ర నాయకులు మానుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణను అపే కుట్రలు చేస్తూ ఇక్కడి ఆంధ్ర, రాయలసీమ సామాన్య ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టవద్దని ఆయన అన్నారు. అవసరమైతే ఈ నెల 5వ తేదీన కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నివాసంలో జరిగే కాంగ్రెసు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. 2009 డిసెంబర్ 7వ తేదీన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని అన్ని పార్టీలు చెప్పిన తర్వాత డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారని, ఆ ప్రకటన అమలును అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నాయకులు ఏకమైన సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నాయని, దాంతో తెలంగాణ భగ్గుమందని ఆయన చెప్పారు.
English summary
TRS MLA KT Rama Rao warned Seemandhra political leaders that they will face dire consequences if obstruct Telangana. He said that Telangana public will obstruct Seemandhra Congress MLAs meeting to be held on march 5.
Story first published: Tuesday, March 1, 2011, 14:15 [IST]