చంద్రబాబు! వివరణ ఇవ్వు: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం పేరుతో తెలంగాణ ప్రజలకు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. వారి రెండు కళ్ల సిద్ధాంతం అర్థం లేనిదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటపైన తెలుగుదేశం పార్టీ వెనుకడుగు వేసిందని అన్నారు. చంద్రబాబు తీరు, టిడిపి వైఖరి చూస్తుంటే అవకాశవాద వైఖరి అవలంభిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబు తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాగా ఈ నెల 10వ తేదిన మిలియన్ మార్చ్ సందర్భంగా ఇంటర్మీడియేట్ బోర్డు పరీక్షలను వాయిదా వేయాలన్నారు. ఆ రోజు తెలంగాణలోని పది జిల్లాలనుండి పదిలక్షలమంది ప్రజలు హైదరాబాద్ను దిగ్బందిస్తారన్నారు. కాబట్టి ఇంటర్ బోర్డు ఆ రోజు జరగనున్న ఇంగ్లీష్ పేపర్ను మరో రోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
Comments
కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ kishan reddy chandrababu naidu telangana srikrishna committee hyderabad
English summary
BJP MLA Kishan Reddy demanded TDP president Chandrababu clarification on United Andhra Pradesh placards today. He accused Chandrababu went in 2009 election with Telangana slogan, but now he left his slogan.
Story first published: Thursday, March 3, 2011, 11:05 [IST]