చంద్రబాబుతో పోలిట్ బ్యూర్ భేటీకి నాగం జనార్దన్ రెడ్డి డుమ్మా

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డికి దూరం పెరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఆ వార్తలను బలపరిచే పరిణామం గురువారం చోటు చేసుకుంది. చంద్రబాబు అధ్యక్షతను గురువారం సాయంత్రం జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డి డుమ్మా కొట్టారు. తెలంగాణపై దూకుడుగా వ్యవహరిస్తున్న జనార్దన్ రెడ్డికి కళ్లెం వేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోనే నాగం జనార్దన్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.

తాము శాసనసభను బహిష్కరించిన నేపథ్యంలో తమ పార్టీకి చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు సమైక్యవాదాన్ని సభలో వినిపించడం సరి కాదని నాగం జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమైక్య నినాదంతో తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు గురువారం శాసనసభా సమావేశాలను అడ్డుకున్నారు. అయితే, సీమాంధ్ర శాసనసభ్యులకు చంద్రబాబు నుంచి అనుమతి ఉందని అంటున్నారు. తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించి, తగిన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు గురువారం చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+