Military Tourism: శౌర్యభూమిలో సాహస యాత్ర.. టైగర్ హిల్ అందాలు!

భారత సైన్యం పరాక్రమానికి, కార్గిల్ యుద్ధ విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రాత్మక క్షేత్రం 'టైగర్ హిల్' సరికొత్త రికార్డుకు వేదికైంది. ద్రాస్ ప్రాంతం కొత్తగా జిల్లా కేంద్రంగా మారిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన 'టైగర్ హిల్ ట్రెక్కింగ్ యాత్ర 2026' అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది.

భారత సైన్యం, ద్రాస్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా ఈ అద్భుతమైన సాహస యాత్రను ముందుకు నడిపించాయి. 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా జూలై 17న జరిగిన ఈ కార్యక్రమం దేశభక్తిని చాటడమే కాకుండా, ఆ ప్రాంత పర్యాటక రంగానికి సరికొత్త జవజీవాలు అందించింది.

Indian Army Successfully Conducts Tiger Hill Expedition 2026 to Promote Adventure and Military Tourism

కళ్లెదుటే యుద్ధ భూమి.. రోమాంచిత అనుభూతి!

ఒకప్పుడు శత్రువుల గుండెల్లో నిద్రపోయి, మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన టైగర్ హిల్‌ను ఇంత దగ్గరగా చూడటం పర్యాటకులకు, సాహస వీరులకు ఒక మరుపురాని అనుభూతిని మిగిల్చింది. ఈ యాత్రలో పాల్గొన్న వారు నాటి కార్గిల్ యుద్ధ విశేషాలను, మన సైనికుల త్యాగాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం ఇదొక సాహస యాత్ర మాత్రమే కాకుండా.. దేశ సైనిక పటిష్టతను, హిమాలయాల అద్భుత సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే 'మిలిటరీ టూరిజం' కాన్సెప్ట్‌తో దీనిని డిజైన్ చేశారు.

స్థానిక యువతకు ఉపాధి.. గైడ్లుగా కాలేజీ స్టూడెంట్స్!

ఈ యాత్రలో అత్యంత కీలకమైన మైలురాయి స్థానిక ప్రజలను, యువతను భాగస్వామ్యం చేయడం. ద్రాస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన శిక్షణ పొందిన టూర్ & ట్రెక్కింగ్ గైడ్స్ ఈ యాత్రలో పాల్గొని పర్యాటకులకు గైడ్ గా వ్యవహరించారు. దీనివల్ల స్థానిక యువతకు పర్యాటక రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు వెల్లడించారు. ఆర్మీ, స్థానిక యంత్రాంగం కలిసి పనిచేస్తే సరిహద్దు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయో చెప్పడానికి ఈ ప్రయోగమే ఒక ఉదాహరణ.

సగర్వంగా రెపరెపలాడుతున్న 72 అడుగుల త్రివర్ణ పతాకం!

కార్గిల్ యుద్ధ వీరుల స్మరార్ధం, గత ఏడాది ద్రాస్ లోని లామోచన్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కొండపై 72 అడుగుల భారీ జాతీయ జెండాను ఆర్మీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ జెండా.. నాటి యుద్ధ భూములైన తోలోలింగ్ పాయింట్, టైగర్ హిల్, పాయింట్ 4875 వంటి కీలక ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని నరనరానా ప్రవహింపజేస్తోంది. లేటెస్ట్ గా జరిగిన ఈ టైగర్ హిల్ యాత్రతో ద్రాస్ ప్రాంతం చరిత్ర, సాహసం, సంస్కృతుల కలయికగా మారి సరిహద్దు పర్యాటకంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ఎలా వెళ్లాలి?

  • లడఖ్ రాజధాని అయిన లేహ్ విమానాశ్రయం లేదా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకోవాలి. శ్రీనగర్ నుంచి ద్రాస్ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది (సుమారు 140 కిలోమీటర్లు).
  • శ్రీనగర్ నుంచి సోనామార్గ్ బై పాస్ మీదుగా జాతీయ రహదారి (NH 1) ద్వారా ద్రాస్ చేరుకోవచ్చు. ద్రాస్ నుంచే టైగర్ హిల్ బేస్ క్యాంప్‌నకు వెళ్లాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఆర్మీ & సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి

ద్రాస్ ఇప్పుడు కొత్త జిల్లా కేంద్రంగా మారింది. కాబట్టి, ట్రెకింగ్ లేదా పర్యాటక యాత్రల కోసం ద్రాస్ లోని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ (District Administration) ఆఫీస్ లేదా టూరిజం శాఖ కార్యాలయంలో ముందస్తు అనుమతి (Permit) తీసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక యాత్రలు

కార్గిల్ విజయ్ దివస్ (జూలై నెల) వంటి ప్రత్యేక సందర్భాలలో భారత సైన్యం స్థానిక యంత్రాంగంతో కలిసి అధికారికంగా 'టైగర్ హిల్ ఎక్స్‌పెడిషన్' ప్రకటనలు విడుదల చేస్తుంది. ఆ సమయంలో ఆర్మీ వెబ్‌సైట్ లేదా స్థానిక ద్రాస్ అడ్మినిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్థానిక గైడ్‌ల సేవలు

ప్రస్తుతం ద్రాస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన శిక్షణ పొందిన టూర్ & ట్రెక్కింగ్ గైడ్స్ అందుబాటులో ఉన్నారు. వీరి ద్వారా స్థానిక టూరిజం డెస్క్‌ను సంప్రదించి ఆర్మీ అనుమతులతో సురక్షితంగా వెళ్లవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+