తెలంగాణ ఎఫెక్ట్: వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు వాయిదా

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపనకు ముహూర్తం కలిసి రావడం లేదు. వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఈ నెల 8వ తేదీన కడప జిల్లా పులివెందులలో ప్రకటిస్తారని అంటూ వచ్చారు. అయితే, ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ పార్టీ స్థాపనపై తెలంగాణ ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు పార్టీని ప్రకటించకూడదని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీ పెడితే తెలంగాణపై ఏదో ఒక వైఖరిని వెల్లడించాల్సి వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నారు. దీంతోనే పార్టీ స్థాపనను ఆయన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో పార్టీని ప్రకటించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో వ్యతిరేకత ఎదురవుతుందని, వ్యతిరేకంగా తీసుకుంటే తెలంగాణలో ప్రవేశించడం కష్టమవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికే ఆయన ప్రయత్నిస్తున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాను బయట పడడానికి వీలవుతుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+