కాంగ్రెసులో బాబు టిడిపిని విలీనం చేస్తారా?: వైయస్ జగన్ వర్గం

సిగ్గూ లజ్జా లేకుండా జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి కోడ్ ఉల్లంఘిస్తున్నారని శాసనసభ్యులు ధ్వజమెత్తారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మినారాయణ కోడ్ను పూర్తిగా ఉల్లంఘించి మంగళవారం రాత్రి జిల్లాలోనే బస చేశారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మంత్రులు కక్షలు, కార్పణ్యాలు రేపుతున్నారని దుయ్యబట్టారు. జగన్ పార్టీని దెబ్బతీయడానికి, దేవగుడి నారాయణరెడ్డికి వస్తున్న మద్దతును ఓర్వలేక బోగస్ ఫిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ సుదర్శన్రెడ్డి, జెడ్పీటీసీ చల్లా సుదర్శన్రెడ్డి, భరత్రెడ్డి, హఫీజుల్లాలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications