కిరణ్, చంద్రబాబు కుమ్ముక్కుతో సమైక్యాంధ్ర కుట్ర: హరీష్ రావు

కుమ్మక్కులో భాగంగానే కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇద్దరు నాయకులు ఒక్కటయ్యారని, తెలుగుదేశం నాయకులు తమ ఎంపిటీసీ సభ్యులను కాంగ్రెసుకు అప్పగిస్తున్నారని, రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. ప్రజా ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే చంద్రబాబుకు, కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యంగా మారాయని, పరస్పర ప్రయోజనాలను వారు చూసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సభ్యులు లేకుండా శాసనసభా సమావేశాలను నిర్వహించుకుంటున్నారని, అది సీమాంధ్ర శాసనసభగా నడుస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications