కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్‌పై చంద్రబాబు, వైయస్ జగన్‌లకు చిక్కులు

Chandrababu Naidu - Ys Jagan
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్- ఇద్దరికీ ఒకే విధమైన ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ప్రతిపక్ష నాయకులుగా కాకరాపల్లి బాధితుల పక్షాన నిలబడాల్సిన అవసరం వారికి ఏర్పడింది. అయితే, వారు ఈ విషయంపై ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టే పరిస్థితిలో లేకుండా పోయారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.

కాకరాపల్లి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు చిక్కులు ఎదురయ్యాయి. బాధితులు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్రపై ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో సీనియర్ తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు సోదరుడు అచ్చెంనాయుడికి వాటాలున్నాయని బాధితులు ఆరోపించారు. బహుశా దీనివల్లనే కావచ్చు, చంద్రబాబు పర్యటనకు ఎర్రంనాయుడు దూరంగా ఉన్నారు. ఈ వివాదంతో ఎర్రంనాయుడు చంద్రబాబుకు దూరమవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కాకరాపల్లి వల్ల తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయిందని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. బహుశా ఎర్రంనాయుడి పాత్రను ఉద్దేశించి ఆ విధంగా అని ఉంటారు. అయితే, మరో రకంగా వైయస్ జగన్ చిక్కుల్లో పడినట్లు అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అనుమతి లభించింది. దీని గురించి సర్దిచెప్పుకోవడానికి జగన్ ప్రయత్నించారు. అప్పుడు ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకించలేదని, ఇప్పుడు వ్యతిరేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+