ఎకె ఖాన్ వర్సెస్ కోదండరామ్: మిలియన్ మార్చ్పై ప్రకటనలు
నగరంలో హింసను ప్రేరేపించే పరిస్థితి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా నగరంలో మరో రెండు మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కు మహిళా ఇన్స్పెక్టర్ను నియమిస్తామని అన్నారు. కాగా సైఫాబాద్ పోలీసులు కోదండరామ్కు మిలియన్ మార్చ్కు అనుమతి లేదంటూ హైకోర్టు నోటీసులు అందజేశారు. ఇందుకు స్పందించిన కోదండరామ్ మేం శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం తుపాకులు చూపిస్తుందన్నారు. మిలియన్ మార్చ్లో తెలంగాణ ప్రజలు అంతా తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.10వ తేదిన మిలియన్ మార్చ్ యథాతథం అన్నారు. శాంతియుతంగా చేసే కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పారు. 10వ తేదిన విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాలని ఆయన సూచించారు.
మిలియన్ మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం అనవసరంగా మార్చ్పై అవాంతరాలు సృష్టించవద్దని కోరారు. అవాంతరాలు సృష్టిస్తే ప్రజలు ఎక్కడికక్కడే దీక్షలు చేపట్టాలని కోరారు. మిలియన్ మార్చ్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్పై ముగుస్తుందని విద్యార్థి జెఏసి చెప్పింది.