హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిమానుల తీరు బాధించింది: అల్లు అర్జున్ రిసెప్షన్‌లో చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పెళ్లి రోజు అభిమానుల తీరు తనను ఎంతో బాధించింది అని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి మంగళవారం యువ హీరో అల్లు అర్జున్-స్నేహారెడ్డిల రిసెప్షన్‌లో అన్నారు. మెగా కుటుంబం అభిమానుల కోసం రాజధాని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అల్లు అర్జున్-స్నేహారెడ్డిల రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. తన అభిమానులే తనకు బలం అని చెప్పారు. అభిమానులు నిత్యం తన వెన్నంటి ఉంటున్నారని చెప్పారు. అఖిల భారత జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెసు ప్రజారాజ్యం పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి తనను పిలిపించింది అంటే దానికి కారణం తన అభిమానులేనని చెప్పారు.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు తనకు అభిమానులు ఎలా అయితే అండగా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారన్నారు. పీఆర్పీని కాంగ్రెసు‌లో విలీనం చేస్తామని ప్రకటించినా అభిమానులు వ్యతిరేకించలేదని చెప్పారు. కాగా రిసెప్షన్ వేడుకకు మెగా ఫ్యామిలీ హాజరయింది. నాగబాబు, పవన్ కళ్యాణ్, రాంచరణ్ తేజ హాజరయ్యారు.

English summary
PRP president and cine hero Chiranjeevi said that Fans are his strength. He said he felt very sad in marriage day. He said that fans were not opposed PRP merger in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X