ఈస్ట్ కోస్ట్ ప్రాజెక్టు: వైయస్ జగన్పై విరుచుకుపడిన శంకర రావు

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సోంపేట పవర్ ప్రాజెక్టుకు, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రాజెక్టుకు భూమిని కేటాయిస్తూ రెండు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన చెప్పారు. నాగార్జున కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలోని సోంపేట పవర్ ప్రాజెక్టుకు 900 ఎకరాలు, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రాజెక్టుకు 1100 ఎకరాలు కేటాయిస్తూ జీవోలు జారీ అయినట్లు ఆయన తెలిపారు. విచారణ జరిపిస్తే ఆ పాపం ఎవరిదో బయటపడుతుందని ఆయన అన్నారు. సోంపేట, కాకర్లపల్లి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైయస్ హయాంలో కూడా ప్రజలు ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications