హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం: కాంగ్రెసు, తెరాస రగడ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Talli
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలో తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం తప్పుపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్రమైన చర్య అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తామే ధ్వంసం చేశామని కాంగ్రెస్ నాయకులు ప్లకార్డులు పెట్టడాన్ని పోచారం, చెన్నమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధ్వంసం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

కాగా మెదక్ జిల్లా హత్నూర్ మండలంలోని దౌల్తాబాద్ మండలంలో మంగళవారం ఉదయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విగ్రహాన్ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. కాగా విగ్రహం ధ్వంసం చేసినందుకు నిరసనగా మంగళవారం హత్నూర్ మండలం బంద్‌కు తెలంగాణ జెఏసి పిలుపునిచ్చింది.

English summary
MLAs Chennamaneni Ramesh and Pocharam Srinivas Reddy were condemned that the Congress put placards at where as Telangana Talli statue destroyed. They said destroyed was unfortunate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X