శ్రీకాకుళం జిల్లా పర్యటనలో వైయస్ జగన్కు చేదు అనుభవం

సోమవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గర 'రైతు-మత్స్యకార మహాధర్నా' కార్యక్రమం ప్రారంభించారు. జనం తక్కువగా ఉండడంతో వెంటనే తంపర గ్రామాలకు బయల్దేరారు. సంతబొమ్మాళి మండలం ఆకాశలఖవరం, వడ్డితాండ్ర, సీరపువానిపేట, పోతినాయుడిపేట గ్రామాల్లో థర్మల్ బాధితుల్ని పరామర్శించారు. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జీరు నాగేశ్వరరావు, సీరపు ఎర్రయ్య కుటుంబాల్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ప్రజల ఆమోదం లేనప్పుడు ప్రాజెక్టు రద్దు చేయాలని సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర ప్రతిపక్ష నేతలు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రినైతే వెంటనే థర్మల్ విద్యుత్కేంద్రాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications