హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ని సమస్యలతో పాటు రైతు సమస్యలకు కూడా కాంగ్రెసు కారణం: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ రైతు సమస్యే అత్యంత ముఖ్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు న్నారు. అందువల్ల రైతును ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.శాసనసభలో బుధవారం ఆయన రైతు సమస్యలపై చర్చ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే మూల కారణమన్నారు. ఒక సమస్యను పరిష్కరించే నిమిత్తం అనేక సమస్యలను సృష్టించి, మిన్నకుండిపోయిందని ఆరోపించారు.

అదేసమయంలో రాష్ట్ర రైతాంగం కష్టాల్లో ఉందన్నారు. వీటిని పరిష్కరించే నిమిత్తం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నిరుటితో ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. రైతులకు బోనస్‌లు ఎందుకు చెల్లించవద్దో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి ధాన్యం ఎగుమతులకు అనుమతించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల రంగుమారిన ధాన్యం మగ్గిపోతోందన్నారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

English summary
TDP president and oppostion leader N Chandrababu Naidu blamed Congress for farmers plight. He demanded in 
 
 assembaly today that farmers crop should be bought.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X