చిరంజీవి, చంద్రబాబు మొసలి కన్నీరు: ఉద్యోగ జెఏసి

మిలియన్ మార్చ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని విధాల తెలంగాణ ప్రజలు సహకరించారని, అయితే ప్రభుత్వం, పోలీసులు మాత్రం ఆ ప్రశాంతతను చెడగొట్టారన్నారు. బలవంతపు అరెస్టుల పేరు చెప్పి మిలియన్ మార్చ్లో పాల్గొనకుండా చాలా మందిని అడ్డుకున్నారన్నారు. సహాయ నిరాకరణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి బలి కాలేదని, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సహాయ నిరాకరణను విరమించుకున్నట్లు చెప్పారు. విగ్రహాల విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ఆరువందలకు పైగా విద్యార్థులు మరణించినప్పుడు వారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications