జపాన్ సునామీ మృతులు 1300 మందికి పైగానే, తీవ్ర నష్టం

భూకంపం వల్ల అణు రియాక్టర్ కూలింగ్ వ్యవస్థపై ప్రభావం పడడంతో రేడియేషన్ ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నావోటా కాన్ ఆదేశించారు. ఫుకుషమా ప్లాంట్ ప్రమాదం ప్రజలపై పడకుండా తగిన చర్యల కోసం జపాన్ అమెరికా సహాయం కోరింది. భూకంప బాధితులను ఆదుకోవడానికి సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్కు అవసరమైన సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.












Click it and Unblock the Notifications