వైయస్సార్ కాంగ్రెసు జెండా ఆవిష్కరణ, జగన్ పార్టీ ఆవిర్భావం

YS Vijayalakshmi
కడప: చాలా కాలంగా ఎదురు చూస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ ఆవిర్భావంతో జరిగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పతాకను జగన్ తల్లి, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి శనివారం ఆవిష్కరించారు. కడప జిల్లా పులివెందులలోని వైయస్సార్ ఘాట్ వద్ద ఆమె పార్టీ పతాకను ఆవిష్కరించారు. జెండాలో నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. మధ్యలో ఉన్న తెలుపు రంగుపై వైయస్ రాజశేఖర రెడ్డి ఛాయాచిత్రం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించినట్లయింది.

జెండాలోని నీలం యువత చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలు. వైయస్సార్ చిత్రపటం చుట్టూ వైయస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను చేర్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో తన తల్లితో కలిసి తాను ఒక కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకుంటానని వైయస్ జగన్ అంతకు ముందు ఎన్నికల సంఘానికి తెలియజేశారు. అయితే, ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+