మాక్ అసెంబ్లీ స్పీకర్గా స్పీకర్గా టిడిపి ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డి
పార్టీల్లో సీమాంధ్రుల పెత్తనమే ఉందన్నారు. తెలంగాణకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ కేంద్రం బిల్లును ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రశ్నించారు. బిల్లు పెట్టకుండా తాత్సారం చేస్తే మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. తెలంగాణ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణపై కేంద్రం దిగిరావలంటే అందరూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం దిగి రావాలంటే రాజీనామాలు ఒక్కటే శరణ్యం అన్నారు.
డిసెంబర్ 9న ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. కేంద్రం కారణంగా 600 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలంగాణ - ఆంధ్రా ఎప్పుడైనా విడిపోవాలంటూ భారత మొదటి ప్రధాని చేసిన ప్రసంగాన్ని వారు గుర్తుకు చేసుకున్నారు. టాంక్బండ్పై విగ్రహాల ధ్వంసంపై సీమాంధ్రులు విష ప్రచారానికి పూనుకుంటున్నారని మాక్ అసెంబ్లీ సభ్యులు అభిప్రాయపడ్డారు.