భర్త శిరీష్ భరద్వాజ్పై పోలీసులకు చిరంజీవి కూతురు శ్రీజ ఫిర్యాదు
చిరంజీవి కుటుంబసభ్యుల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ, శిరీష్ల మధ్య మూడున్నరేళ్లకే మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 17, 2007న శ్రీజ, శిరీష్ భరద్వాజ్లు న్యూబోయిన్పల్లిలోని ఆర్య సమాజ్లో నాటకీయ పరిణామాల మధ్య పెళ్లిచేసుకున్నారు. శ్రీజకు సంతానం కలిగిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడ్డంతో చిరంజీవి కూడా మెత్తబడ్డారు. చిరంజీవి శ్రీజను ఆశీర్వదించడంతో శిరీష్కు సెన్సార్బోర్డు సభ్యుడిగా పదవి దక్కింది. కొంతకాలంగా శ్రీజ, శిరీష్భరధ్వాజ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలిసింది.
తాను ఇప్పటికే శిరీష్ భరద్వాజ్కు, మెట్టినింటికి కోట్లాది రూపాయలు ఇచ్చానని, ఇంకా అడుగుతున్నారని శ్రీజ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ తాగి తనను చిత్రహింసలకు గురి చేయడం శిరీష్కు అలవాటుగా మారిందని ఆమె ఆరోపించినట్లు సమాచారం. శిరీష్ 1 కోటీ 50 లక్షల రూపాయలు తేవాలని శిరీష్ శ్రీజను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.