వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు యెడ్ల షాక్: బొత్స ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లోకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా జెడ్పీటీసీ యెడ్ల రమణమూర్తి మంగళవారం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. యెడ్ల పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు మూడు నెలల క్రితమే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ సరిగా స్పందించలేదని తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో మంచి పట్టు ఉన్న యెడ్లను పార్టీలోనే ఉంచడానికి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. యెడ్ల టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.

యెడ్లకు జిల్లాలో మంచి పట్టు ఉంది. గ్రామీణ స్థాయిలో అయనకు మంచి పేరు ఉంది. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు పొందాడు. అలాంటి వ్యక్తిని నిలబెట్టుకోవడానికి టిడిపి ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. కాగా తనను కొందరు పార్టీ నేతలు తమ తమ మొండి వైఖరితో బయటకు పంపారని ఆయన అన్నారు. కాగా ఆయనను మంత్రి బొత్స సత్యనారాయణ సాధరంగా ఆహ్వానించారు.

గత కొంతకాలంగా యెడ్ల టిడిపిని వీడుతారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై టిడిపి దృష్టి సారించలేదని వాదనలు వచ్చినప్పటికీ, చాలామంది ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి పార్టీలో చేరతారనే వాదనలు వినిపించాయి. అయితే అందరి ఊహాగానాలు తారుమారు చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయారు.

English summary
Vijayawada TDP senior leader Yedla Ramana Murthy gave a shock to TDP president Chandrababunaidu today. He joined in Congress. Minister Botsa welcomed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X