హీరోనని లగడపాటి అనుకుంటున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ:
హైదరాబాదులోని
ట్యాంక్
బండ్పై
విగ్రహాల
విధ్వంసంపై
తమ
పార్టీ
సీమాంధ్ర
పార్లమెంటు
సభ్యుడు
లగడపాటి
రాజగోపాల్
చేసిన
వ్యాఖ్యలపై
కాంగ్రెసు
తెలంగాణ
ప్రాంత
పార్లమెంటు
సభ్యులు
తీవ్రంగా
మండిపడ్డారు.
లగడపాటి
రాజగోపాల్
తాను
హీరోనని
అనుకుంటున్నారని,
తమాషా
చేస్తున్నారని
గుత్తా
సుఖేందర్
రెడ్డి
బుధవారం
మీడియా
ప్రతినిధుల
సమావేశంలో
అన్నారు.
విగ్రహాల
కూల్చివేతను
సాకుగా
తీసుకుని
లగడపాటి
తెలంగాణ
ప్రజలను
తాలిబన్లుగా,
తీవ్రవాదులుగా
చూపించే
ప్రయత్నం
చేస్తున్నారని,
మత
విద్వేషాలను
రెచ్చగొట్టే
కుట్ర
చేస్తున్నారని
ఆయన
అన్నారు.
విగ్రహాలను
దేవుళ్లతో
పోల్చి
మత
విద్వేషాలను
రెచ్చగొట్టే
ప్రయత్నం
చేస్తున్నారని
ఆయన
అన్నారు.
విగ్రహాలకు
దేవుళ్లకు
పోలికేమిటని
ఆయన
అడిగారు.
ఆలాంటి
లగడపాటికి
పార్లమెంటు
సభ్యుడిగా
కొనసాగే
అర్హత
లేదని
ఆయన
అన్నారు.
తెలంగాణను
అడ్డుకునే
కుట్రలో
భాగంగానే
లగడపాటి
ఆ
విధంగా
మాట్లాడుతున్నారని
ఆయన
విమర్శించారు.
తెలంగాణ
ప్రజలను
రెచ్చగొట్టేందుకు
లగడపాటి
ప్రయత్నిస్తున్నారని
ఆయన
అన్నారు.
రాష్ట్రం
విడిపోయి
ప్రజలుగా
కలిసి
ఉందామని
తాము
భావిస్తుంటే
ప్రజల
మధ్య
చిచ్చు
పెట్టేందుకు
లగడపాటి
పని
చేస్తున్నారని
ఆయన
వ్యాఖ్యానించారు.
లగడపాటి
అటువంటి
ప్రకటనలు
చేయడం
వల్ల
ఉద్రేకాలు
పెరుగుతాయని
ఆయన
అన్నారు.
విభజన
కోసం
తాము
పోరాటం
చేస్తున్నామని,
కావాలంటే
వారి
అభిప్రాయాలను
సీమాంధ్ర
నాయకులు
చెప్పుకోవచ్చునని,
ఏది
న్యాయమైతే
దానికి
అనుగుణంగా
పార్టీ
అధిష్టానం
నిర్ణయం
తీసుకుంటుందని
ఆయన
అన్నారు.
శ్రీకృష్ణ
కమిటీ
నివేదికలో
తమకు
అనుకూలంగా
ఉన్న
విషయాలతో
సీమాంధ్ర
నాయకులు
కరపత్రాలు
పంచుతున్నారని,
వాటిపై
సంతకాలు
కూడా
పెట్టడం
లేదని,
దమ్ముంటే
సంతకాలతో
కరపత్రాలు
పంచాలని
ఆయన
అన్నారు.
లగడపాటి
అతి
తెలివిగా
వ్యవహరిస్తున్న
పిచ్చివాడని
ఆయన
వ్యాఖ్యానించారు.
Congress Telangana region MP Gutta Sukhender contered MP Lagadapati Rajagopal comments on distruction of statue on Tank bund during Million March. He said that Lagadapati is provocation public with his statements.
Story first published: Wednesday, March 16, 2011, 18:25 [IST]