హీరోనని లగడపాటి అనుకుంటున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణను అడ్డుకునే కుట్రలో భాగంగానే లగడపాటి ఆ విధంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామని తాము భావిస్తుంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు లగడపాటి పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటి అటువంటి ప్రకటనలు చేయడం వల్ల ఉద్రేకాలు పెరుగుతాయని ఆయన అన్నారు. విభజన కోసం తాము పోరాటం చేస్తున్నామని, కావాలంటే వారి అభిప్రాయాలను సీమాంధ్ర నాయకులు చెప్పుకోవచ్చునని, ఏది న్యాయమైతే దానికి అనుగుణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తమకు అనుకూలంగా ఉన్న విషయాలతో సీమాంధ్ర నాయకులు కరపత్రాలు పంచుతున్నారని, వాటిపై సంతకాలు కూడా పెట్టడం లేదని, దమ్ముంటే సంతకాలతో కరపత్రాలు పంచాలని ఆయన అన్నారు. లగడపాటి అతి తెలివిగా వ్యవహరిస్తున్న పిచ్చివాడని ఆయన వ్యాఖ్యానించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications