జయలలిత అతి విశ్వాసం, మిత్రపక్షాలకు టోకరా

ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో మిత్రపక్షాల అండతోవీరు గెలిచారని, ప్రస్తుతం తమతో చర్చించకుండానే జయలలిత నిర్ణయం తీసుకున్నారని వామపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్తో వామపక్షాల నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. కాగా, సినీ నటుడు కార్తిక్ ఇప్పటికే జయలలితకు దూరమయ్యారు. తనకు ఒక్క సీటైనా జయలలిత కేటాయిస్తారని ఆయన ఆశించారు. అయితే, ఆ ఒక్క సీటు కూడా ఆయనకు దక్కలేదు. తనకు ఒక్క సీటు ఇస్తారని కార్తిక్ ఏకపక్షంగా ప్రకటించడం వల్లనే జయలలిత కోపగించుకున్నారని, అందుకే ఆ సీటు కూడా కేటాయించలేదని అన్నాడియంకె వర్గాలు అంటున్నాయి.
కాగా, వైగో నాయకత్వంలోని ఎండిఎంకెతో కూడా అన్నాడియంకె సంబంధాలు బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎండియంకెకు 35 సీట్లకు పోటీ చేసింది. అయితే, ఈసారి 8 స్థానాలు మాత్రమే ఇస్తామని జయలలిత ఎండియంకె నేతలకు తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ విభేదాలతో యండిఎంకె కూడా కూటమి నుంచి వైదొలిగినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications