హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై అహ్మదుల్లా సీరియస్, జానీ ఓటమికి కుట్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి మహ్మద్ జానీ ఓటమికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై మంత్రి అహ్మదుల్లా తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు క్రాస్ వోటింగ్‌కు పాల్పడడంతో మహ్మద్ జానీ అతి కష్టంగా బయటపడిన విషయం తెలిసిందే. క్రాస్ వోటింగ్‌కు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని, మైనారిటీ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నించినవారిని ఉపేక్షించకూడదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

జానీకి వ్యతిరేకంగా పనిచేసి వైయస్ జగన్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. మహ్మద్ జానీకి వ్యతిరేకంగా వ్యవహరించి వైయస్ జగన్ మైనారిటీల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన వ్యాఖ్యానించారు. జానీని ఓడించడానికి వైయస్ జగన్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. క్రాస్ వోటింగ్‌కు పాల్పడి జానీ ఓడించడానికి ప్రయత్నించినవారిపై కాంగ్రెసు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసులోని ఉంటూ కాంగ్రెసునే వెన్నుపోటు పొడిచినవారిని దేవుడు క్షమించడని ఆయన అన్నారు.

English summary
Minister Ahmadullah lashed out at YSR Congress leader YS Jagan for resorting conspiracy to defeat Congress candidate Mohammad Korney in MLC election held under MLAs quota. He warned YS Jagan camp MLAs that he will complain to Congress high command against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X