బెడిసికొట్టిన కెసిఆర్, చంద్రబాబు వ్యూహాలు: గట్టెక్కిన కిరణ్ కుమార్
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహం వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నైతికంగా దెబ్బ తిన్నట్లే. మహ్మద్ జానీ గెలిచినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి నైతికంగా దెబ్బ తిన్నారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యులు మహ్మద్ జానీని ఓడించేందుకు ప్రయత్నించారు. పది మంది జగన్ వర్గం శాసనసభ్యులు క్రాస్ వోటింగ్ చేశారు. అయితే, వైయస్ జగన్ సూచించినట్లు జానీకి కేటాయించిన శాసనసభ్యులంతా మజ్లీస్ అభ్యర్థి రిజ్వీకి ఓటేసి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం పూర్తిగా బెడిసికొట్టేదే.
కాగా, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు నైతికంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రమాదకరంగానే పరిణమించాయి. తెరాస అభ్యర్థి మహ్మద్ అలీకి 13 ఓట్లు రావాల్సి ఉండగా 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెరాసకు 11 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ బిజెపి ఓట్లు రెండు కూడా ఉన్నాయి. ఇందుకు బిజెపిని నిందించడానికి తెరాస నాయకులు ప్రయత్నించారు. దీనికి బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ రెండు ఓట్లు తెరాసకే వేశామని చెప్పారు. దాంతో తమ శాసనసభ్యులు ఇద్దరు క్రాస్ వోటింగ్కు పాల్పడినట్లు తెరాస నాయకులు గుర్తించారు. దీంతో తెరాస ఆత్మరక్షణలో పడింది.