కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ జగన్ ఎదురీత, క్యాంపులు

YS Jagan
కడప: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటాల కడప జిల్లా నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థిని గెలిపించుకోవడానికి వైయస్ జగన్ ఎదురీదుతున్నారు. ఈ ఎన్నికను వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. వైయస్ జగన్ ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చాలా మందిని బెంగుళూర్, మైసూర్ క్యాంపుల్లో పెట్టారు. ఇక్కడ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని దించలేదు. దీంతో కాంగ్రెసు పార్టీకి, వైయస్ జగన్ వర్గానికి మధ్య పోటీ నెలకొని ఉంది.

కాంగ్రెసు పార్టీ హైదరాబాదులోనూ కడపలోనూ క్యాంపులు నిర్వహిస్తోంది. కడప నియోజకవర్గంలో 623 ఓట్లున్నాయి. కాంగ్రెసుకు 503 ఓట్లున్నాయి. తెలుగుదేశం పార్టీకి 120 ఓట్లున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు పార్టీకి చెందిన ఓట్లతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను కాంగ్రెసు, జగన్ వర్గం సగమేసి పంచుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన 30 మంది ఓటర్లు తటస్థంగా ఉన్నారు. వీరిని లాక్కోవడానికి ఇరు పక్షాలు పోటీ పడుతున్నాయి.

కాగా, జగన్ వర్గం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని ఓడించడానికి మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. వీరి వ్యూహాలు ఎదుర్కోవడం జగన్ వర్గానికి కష్టంగానే మారింది. ఆదిలోనే జగన్ వర్గాన్ని దెబ్బ తీయాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక జగన్‌కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+