ఎమ్మెల్సీ పోలింగ్ షురూ, కాంగ్రెసు వర్సెస్ వైయస్ జగన్ క్యాంప్

పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు మేకా శేషాబాబును పోలీసులు పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు. శేషాబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. నెల్లూరులోని పోలింగ్ కేంద్రంలోకి బయటివారిని అనుమతిస్తున్నారంటూ జగన్ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో జగన్ వర్గానికి, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో తమ ఓటర్లను కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరోపించారు.












Click it and Unblock the Notifications