శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయంలోని రహస్యాలు ఇవే
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయంలోని అంశాలు ఇలా ఉన్నాయి - రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మజ్లీస్, బిజెపి బలపడతాయి. తెలంగాణ ఇస్తే మతఘర్షణలు పెరిగే ప్రమాదం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతానికి జర్నలిస్టులు కవర్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కువ చేసి చూపుతున్నారు. హైదరాబాదులో సీమాంధ్రుల పెట్టుబడులే ఎక్కువ. అందువల్ల తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులు తరలిపోతాయి. దాంతో హైదరాబాదు ఉనికి కోల్పోతుంది. మీడియా మేనేజ్మెంట్ సాధ్యం కాదు. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయి.
హైదరాబాదు మావోయిస్టుల అడ్డాగా మారుతుంది. తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతాయి. అధికార పార్టీ నాయకులు ఐక్యంగా ఉండాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణవారికి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని బుజ్జగించాలి. రాష్ట్రంలోని 13 టీవీ చానెళ్లలో రెండు మాత్రమే తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యమాలను గాయాలు కాకుండా అణచివేయాలి. సాధ్యమైనంత త్వరగా ఆందోళనలను అదుపుచేయాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో బలగాలను మోహరించాలి.