నాగార్జున ఇంటిపై ఐటి దాడులు, అక్కినేని సంస్థల్లో సోదాలు

హైదరాబాదు, చెన్నై, బెంగళూర్ల్లో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 బృందాలు ఎఎన్ఆర్ సంస్థల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ఇంకా జరిగే అవకాశం ఉంది. నాగార్జున పెద్ద యెత్తున డబ్బులు పెట్టి భూమి కొనుగోలు చేసినట్లు ఐటి అధికారులు గుర్తించారు. దీనిపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముందస్తు పన్ను అంచనాల్లో లోపాలు జరిగాయని, ఆదాయానికి తగిన పన్ను చెల్లించలేదని అనుమానాలు రావడంతో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications