సొంత జిల్లాలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి షాక్: జగన్ వర్గం విన్
జగన్ వర్గం అభ్యర్థి గెలుపొందటంతో ముఖ్యమంత్రి కిరణ్కు పెద్ద షాక్. ముఖ్యమంత్రి కిరణ్కు ప్రధాన ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వర్గాన్ని గెలిపించడానికి తీవ్రంగా కృషి చేశారు. సిఎం, పెద్దిరెడ్డి ఇద్దరూ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నప్పటికీ వారి ఇద్దరి మధ్య కలహం మాత్రం ఏళ్లుగా కొనసాగుతోంది. దీంతో పెద్దిరెడ్డి జగన్ వర్గం అభ్యర్థిని గెలిపించి సింకు షాక్ ఇస్తానని ప్రకటించారు. పెద్దిరెడ్డి తాను చెప్పినట్టే కాంగ్రెసు అభ్యర్థిని ఓడించి సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో సొంత జిల్లాలోనే కిరణ్ కుమార్ ఎమ్మెల్సీ సీటును గెలిపించుకోలేక పోయారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు.
ఎన్నికలు జరిగిన తొమ్మిది సీట్లలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ, జగన్ వర్గం మూడు మూడు సీట్లు గెలుచుకున్నాయి. టిడిపికి గతంలో ఒక్క సీటు ఉండగా ఇప్పుడు రెండు సీట్లు అదనంగా గెలుచుకుంది. జగన్ వర్గం మూడు సీట్లు కైవసం చేసుకుంది. దీంతో ఎటూ నష్టపోయింది కాంగ్రెసు పార్టీయే. ఎమ్మెల్యే కోటాలో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా తన అభ్యర్థులను గెలిపించుకున్న సిఎం కిరణ్ స్థఆనిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తన సొంత జిల్లా అభ్యర్థినే గెలిపించుకోలేక పోయారు.