వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రాష్ట్రాన్ని దోచాడు ముఖ్యమంత్రి ఐతే ఇక అంతే: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకున్నారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గురువారం డిల్లీలో విలేకరులతో అన్నారు. తాను 1970నుండి కాంగ్రెసు పార్టీలో ఉన్నానని, అయితే మా దగ్గర అంత డబ్బు లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా అంత డబ్బు లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని జగన్‌పై విచారణ గురించి అడిగానని చెప్పారు.

కాంగ్రెసు అవినీతిని సహించదన్నారు. 2జి స్పెక్ట్రంలో డిఎంకె అవినీతిని, ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, కామన్వెల్తు కుంభకోణంలో సురేష్ కల్మాడీపై కాంగ్రెసు పార్టీ వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిరూపించుకోవాలంటే జగన్ ఆస్తులపై విచారణ చేయించాలన్నారు. తండ్రి ఉండగానే జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇక ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఉంటుందా అని అన్నారు.

తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటాన్ని ఆయన అడ్వాంటేజ్‌గా తీసుకొని సంపాదించారని ఆరోపించారు. వైయస్ మరణించినందువల్ల ఆయనపై తానేమీ వ్యాఖ్యానించనని చెప్పారు. జగన్ ప్రజలకు తాను ఎలా డబ్బు సంపాదించానో బయట పెట్టాలన్నారు. ప్రజలు అమాయకులు కాదన్నారు. వారికి అన్నీ తెలుసన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి, అవినీతికి సంబంధం లేదన్నారు.

English summary
Congress senior leader V Hanumantha Rao blamed Ex MP YS Jaganmohan Reddy today. He said Jagan increased corruption in his father time. He asked CM Kiran Kumar Reddy to enquiry on YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X