వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రులతో కూర్చునేది లేదు: ఎంపీ సర్వే సత్యనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులతో కూర్చునేది లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట ఎంపీ సర్వే సత్యనారాయణ సీమాంధ్ర ఎంపీలతో కలిసి భేటీకి ఒప్పుకునేది లేదని తెల్చి చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో అధికార పార్టీ పార్లమెంటు సభ్యులను ఏకత్రాటి పైకి తీసుకు రావడానికి కేంద్రమంత్రి ఆజాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మొదట తెలంగాణ ఎంపీలతో ఆ తర్వాత సీమాంధ్ర ఎంపీలతో సమావేశమయ్యారు. సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల సయోద్యకు ఆజాద్ ఎంతగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

తెలంగాణ ఎంపీలతో సమావేశమైన ఆజాద్ ఆ తర్వాత సీమాంధ్ర ఎంపీలతో కలిసి మరో భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పగా అందుకు తెలంగాణ ఎంపీలు తిరస్కరించినట్లుగా తిరస్కరించారు. వారి అభిప్రాయాలతో తాము ఏకీభవించలేమని, మా ప్రాంత పరిస్థితుల దృష్ట్యా వారితో కలసి భేటీని ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున మే 10 వరకు ఆగుతామని ఆ తర్వాత మాత్రం ఆగలేమని వారు చెప్పారు. కావాలంటే కార్యకర్తలుగా కొనసాగుతామని చెప్పారు. తాము గత్యంతరం లేకనే ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రకటించకుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
MP Survey Satyanarayana told to centre minister Ghulam Nabi Azad today that Telangana MPs will not sit with Seemandhra MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X