గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ

అయితే ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విపక్షాల తీరును తప్పు పట్టారు. చంద్రబాబు తనకు ఎవరి మీద నమ్మకం లేనట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. అధికార పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ రాజ్యాంగపరంగా వెళ్లాలనే తాము అనుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించనప్పటికీ వాటిని రికార్డులనుండి తొలగించాలని ఆయన ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ను కోరారు.
అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విపక్షాలను బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరారు. ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశ పెట్టడంలో ఎలాంటి మతలబు లేదన్నారు. బిల్లును ఇక్కడ ఆమోదింపజేసి ఇక్కడినుండి శాసనమండలికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. శాననమండలి చైర్మన్, ఉపాధ్యక్షుల పదవీ కాలం నేటితో ముగుస్తున్నందునే బిల్లుకు సహకరించాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం భూకేటాయింపులపై ఏమైనా పొరపాట్లు చేస్తే ఎత్తి చూపండని అన్నారు. భూకేటాయింపులపై ప్రభుత్వం ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నారు.
కాగా భూకేటాయింపులపై హౌస్ కమిటీని తాము ఈరోజు అడగటం లేదని టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. చాలా రోజులనుండి అడుగుతున్నామని చెప్పారు. అధికార పార్టీలో చీలిలకు ఉన్నందునే కమిటీ వేయానికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. అయితే విపక్షాలు భూకేటాయింపులపై పట్టుబట్టడంతో ప్రభుత్వం గందరగోళం మధ్య ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశ పెట్టింది. చివరకు ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం జరిగింది. దీంతో విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు.












Click it and Unblock the Notifications