హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ ప్రబల శక్తి ఎదుగుతోంది, కానీ... : సిపిఐ నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం అన్నారు. అయితే జగన్ తన తండ్రి హయాంలో జరిగిన భూకేటాయింపులపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. జగన్‌పై అక్రమాల ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని వాటిపై ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

కాగా కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తుందని చెప్పారు. సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీ పొత్తులలో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు. తాము టిడిపికే మద్దతు ఇస్తామని చెప్పారు. కాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ఆయన మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు చేపడతామని ఆయన అన్నారు.

English summary
CPI state secretary Narayana said today that Ex MP YS Jaganmohan Reddy party will strengthen. He questioned Jagan about allegations which were revealed on land allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X