కడప ఎన్నికలలో 5గురు జగన్లు: అధికార కాంగ్రెసు వ్యూహం?

అయితే వైయస్ మరణం తర్వాత జగన్ పార్టీని వీడిపోవడంతో కాంగ్రెసు అక్కడ తమ పట్టు కోల్పోకుండా ఉండే ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా ప్రజలు కాంగ్రెసుతోనే ఉన్నారన్న ఉద్దేశ్యాన్ని రాష్ట్రంలో కల్పించడానికి ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికలు సవాలుగా నిలిచాయి. అయితే జగన్ బాబాయి వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసు వైపే ఉండటం కాస్త కాంగ్రెసుకు లాభం చేకూర్చే విషయమే అయినప్పటికీ శాసనమండలి ఎన్నికలలో ఓటమితో మరింత పకడ్బందీగా కడప పార్లమెంటునుండి జగన్ను, పులివెందులనుండి విజయమ్మను ఓడించేందుకు కాంగ్రెసు వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
జగన్ను ఓడించడానికి కాంగ్రెసు అభ్యర్థితో పాటు మరో నలుగురిని బరిలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు కాంగ్రెసు నేతలు ఆ నియోజకవర్గంలో జగన్ పేరుతో ఉన్న వారి కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పేరుతో ఉన్న వారిని మరో నలుగురిని బరిలోకి దింపి ఓటర్లను గందరగోళ పరిస్థితిలోకి నెట్టే ఉద్దేశ్యంలో అధికార కాంగ్రెసు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో జగన్కు పడే ఓట్లలో కొన్నింటిని అయినా చీల్చవచ్చని, దాని ద్వారా లాభపడవచ్చునని అధికార పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెసు, జగన్ వ్యూహ ప్రతివ్యూహాలలో ఎవరి వ్యూహం బెడిసి కొడుతుందో లేక వీరిద్దరి వ్యూహాల మధ్య టిడిపి లాభ పడుతుందో ఎన్నికల అనంతరం తెలుస్తుంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications