హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ నమస్తే తెలంగాణ జపం, కార్యకర్తలకు పత్రిక టార్గెట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి విరామం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పుడు నమస్తే తెలంగాణ జపం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన నమస్తే తెలంగాణ పేరిట ఓ తెలుగు దినపత్రికను ప్రారంభించబోతున్నారు. పార్టీ కార్యకర్తలను ఆయన మండలస్థాయి వార్తా పత్రిక ఏజెంట్లుగా మార్చేశారు. మొదటి ఆరు నెలల కాలంలో మూడు నుంచి మూడున్నర లక్షల సర్క్యులేషన్ ఉండేలా ఆయన పత్రిక ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

తెలంగాణ వాయిస్‌గా చెబుతున్న నమస్తే తెలంగాణ పత్రిక ఏప్రిల్ చివరి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ మార్కెట్లోకి రావచ్చునని అంటున్నారు. ఆ పత్రిక తెలంగాణ గుండె చప్పుడు అనే స్లగ్ ఇస్తున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో ఒకేసారి కాకుండా తొలుత ఏడు జిల్లాల్లోకి ఈ పత్రిక వెళ్తుందట. క్రమంగా దాన్ని పది జిల్లాలకు విస్తరిస్తారని అంటున్నారు. పత్రిక సర్క్యులేషన్ పెంచాలని ఆదేశిస్తూ కెసిఆర్ మండల స్థాయి వరకు పార్టీ నాయకులందరికీ లేఖలు రాశారు. పత్రిక సర్క్యులేషన్ పెంచే బాధ్యతను ఆయన పార్టీ నాయకులపై పెడుతున్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao has opened another front in his quest for a separate state. Virtually turning his partymen from the state to the mandal-level into newspaper agents, he has directed them to ensure that the Telugu daily to be launched by him achieves a circulation of 3 to 3.5 lakh within the first six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X