తెరాస నేత సాంబశివుడి హత్య నయీం ముఠా పనే: ఎస్పి

సాంబశివుడి హత్యలో పాల్గొన్న నయీంతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆధిపత్య పోరులోనే సాంబశివుడు హత్యకు గురైనట్లు ఆయన తెలిపారు. నయీంకు, సాంబశివుడికి మధ్య పాతకక్షలున్నాయని, వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ఆయన అన్నారు. సాంబశివుడి హత్యకు నయీం ముఠా పలు మార్లు రెక్కీ నిర్వహించిందని, హైదరాబాదులోని ఎల్బీ నగర్ ధూంధాం కార్యక్రమంలో కూడా రెక్కీ నిర్వహించారని ఆయన వివరించారు. సాంబశివుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు నయీమేనని ఆయన చెప్పారు.
సాంబశివుడి హత్య కోసం ఐదు లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవారని ఆయన చెప్పారు. పది రోజుల్లో సాంబశివుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంబశివుడిని తామే హత్య చేశామని ఇటీవల కొంత మంది లొంగిపోయారు. వారిని ఈ కేసులో పోలీసులు చూపించలేదు. వారికి సంబంధించి విచారణ జరుగుతోంది. సాంబశివుడి హత్యకు ఈ ఏడాది జనవరిలోనే కుట్ర చేశారని ఎస్పీ చెప్పారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications