వైయస్ జగన్ శిబిరంతోనూ కందుల బ్రదర్స్ మంతనాలు

కాంగ్రెసులో చేరే విషయాన్ని వాయిదా వేసి కందుల సోదరులు బుధవారం రాత్రి వైయస్ జగన్ వర్గం నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతామని, అయితే 2014 ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కందుల సోదరులు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. దానికి వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంగీకరించలేదని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెసు నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీంతో ఎట్టకేలకు వారు నిర్ణయం తీసుకుని గురువారం మధ్యాహ్నం కాంగ్రెసులో చేరిపోయారు.
కాగా, ఇప్పటికీ కడప పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేయడానికి కందుల రాజమోహన్ రెడ్డి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమోహన్ రెడ్డి వినకపోతే కందుల శివానంద రెడ్డిని పోటీకి దించే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉంది. కందుల సోదరులు కాకపోతే తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీ చేయాల్సి రావచ్చు. తమ కాంగ్రెసు కడప అభ్యర్థి రవీంద్రా రెడ్డేనని శాసనసభ్యుడు వీరశివా రెడ్డి అంటున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications