జగన్పై దుమ్మెత్తి పోసిన వరదరాజులు, వైయస్ను అలా అనలేదన్న డిఎల్

తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని జగన్ వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలను ఎంత వరకైనా ఖర్చు పెట్టి గెలవాలని ఆయన ఆశిస్తున్నారని అన్నారు. అవినీతిపరుడు అయిన జగన్ను ప్రజలు గెలిపించరన్నారు. తన మద్దతు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికే ఉంటుందన్నారు. కడప, పులివెందులలో తప్పకుండా కాంగ్రెసు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఉప ఎన్నికలు తాము ఛాలెంజ్గా తీసుకోవడం లేదని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు తప్పకుండా గెలుస్తుందని అన్నారు. పోటీ జగన్ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి తమకు కాదని, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసుకు మధ్యే ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని అవినీతిపరుడు అని తాను ఎప్పుడూ అనలేదన్నారు. ప్రణాళికా లోపం వల్లే నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. కాంగ్రెసు పథకాలే తనను గెలిపిస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications