బ్రాహ్మణి స్టీల్స్ను ఉత్తమ్ గాల్వాకు అమ్మిన గాలి జనార్దన్ రెడ్డి
కాగా, బ్రాహ్మణి స్టీల్స్కు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో ఎకరాకు 18,500 రూపాయల చొప్పున 10,670 ఎకరాలు కేటాయించారు. దానికి వాడుకునేందుకు అనంతపురం జిల్లాలో ఇనుము గనులను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అప్పగించింది. బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణంలో జాప్యం చేస్తూ ఇనుప ఖనిజాన్ని గాలి జనార్దన్ రెడ్డి ఎగుమతి చేసి పెద్ద యెత్తున సొమ్ము సంపాదించారనే విమర్శలు ఉన్నాయి. ఆయన అక్రమ మైనింగ్కు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది.
బ్రాహ్మణి స్టీల్స్ ప్రగతిని సమీక్షించి, నోటీసులు ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆశించిన మేరకు బ్రాహ్మణి స్టీల్స్ పనులు సాగలేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. బ్రాహ్మణి స్టీల్స్లో వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్కు వాటాలున్నాయని అంటారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో గాలి జనార్దన్ రెడ్డి పనులకు ఆటంకాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ వాతావరణంలో గాలి జనార్దన్ రెడ్డి దాన్ని విక్రయించినట్లు చెబుతున్నారు.