హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణిపై 30 రోజుల గడువు: కిరణ్ ప్రభుత్వం నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం అమలులో వైఫల్యం చెందారంటూ బ్రహ్మణి స్టీల్స్‌ సంస్థ అధినేత గాలి జనార్దన్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంజాయిషీ నోటీసు జారీచేసింది. ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా సమాధానం ఇవ్వకపోయినా, అది సంతృప్తికరంగా లేకపోయినా ఒప్పందాన్ని రద్దుచేస్తామని నోటీసులో స్పష్టంచేసింది. ఒప్పందం మేరకు రూ.4500 కోట్ల పెట్టుబడితో మొదటి దశను 2009 డిసెంబరులోగా పూర్తిచేయాలి. కానీ పనులు ముందుకు సాగడం లేదు. 2009 డిసెంబర్‌ తర్వాత మొత్తానికి పనులన్నింటినీ బ్రహ్మణి నిలిపేసింది. నిబంధనల ప్రకారం ఎంవోయూ గడువు ముగిశాక ఒప్పందం రద్దుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలున్నాయి.

2009 డిసెంబరు తర్వాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బ్రహ్మణిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్‌ మరణం, గనుల వ్యాపారం స్తంభించిపోవడం వల్లే పనుల్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందంటూ యాజమాన్యం సాకులు చెబుతుండగా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. చివరికి ఇటీవల రాష్ట్రంలో భూముల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమై, శాసనసభ, మండలిలో బ్రహ్మణి ప్రకంపనలు సృష్టించడం, విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గాలి జనార్దన్‌రెడ్డి సొంతంగా ఈ కర్మాగారాన్ని చేపట్టే పరిస్థితి లేనందున ఒప్పందాన్ని రద్దుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంజాయిషీ నోటీసు ఇవ్వాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా న్యాయశాఖను సంప్రదించాక పరిశ్రమల శాఖ నోటీసును సిద్ధంచేసి శుక్రవారం జారీ చేసింది.

English summary
CM Kiran Kumar Reddy's Government issued notice to Karnataka minister Gali Janardhan Reddy on Brahmani Steels proposed in Kadapa district. Government gave 30 days time to Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X