హరికృష్ణ డమాల్, తనయుడు నారా లోకేష్కు చంద్రబాబు లైన్ క్లియర్

హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ మేరకు ముందుకు వెళ్తారనేది కూడా చూడాలని ఆయన అనుకున్నట్లు చెబుతారు. వాస్తవానికి, హరికృష్ణకు ఓ ఫోన్ కొట్టి మాట్లాడితే కృష్ణా జిల్లా వ్యవహారాలు చక్కబడి ఉండేవని అంటారు. కానీ, అందుకు చంద్రబాబు సిద్ధపడలేదు. హరికృష్ణకు ప్రాధాన్యం తగ్గించడం కూడా చంద్రబాబు ఎత్తుగడలోని ఆంతర్యమని అంటారు. జూనియర్ ఎన్టీఆర్కు ఆయన సింగపూర్ నుంచి ఫోన్ చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దాన్ని సాకుగా తీసుకుని హరికృష్ణతో గానీ జూనియర్ ఎన్టీఆర్తో గానీ మాట్లాడకుండా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఒక రకంగా వారి స్థాయిని తగ్గించడం కూడా ఆయన వ్యూహంలో ఒక భాగం. దానివల్ల భవిష్యత్తులో తన కుమారుడిని ముందుకు తెస్తే కూడా వారు పోటీకి రాకుండా చూసుకునేందుకు ఇటువంటి వ్యవహారం ఎలా పనికి వస్తుందనేది ఆయన చూడదలుచుకున్నారు.
కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుతో కలిసి పనిచేసేది లేదని చెప్పిన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ తనంత తానుగా దిగి వచ్చి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. దేవినేని ఉమతో కలిసి పనిచేస్తానని చెప్పారు. తాను తప్పు చేశానని కూడా అంగీకరించారు. తన వల్ల పార్టీలో వారసత్వ పోరు జరుగుతుందనే వార్తలు వస్తుండడంతో తాను సరిగా వ్యవహరించలేదని తెలుసుకున్నట్లు ఆయన ఆయన చెప్పారు. మొత్తం మీద, లోకేష్కు లైన్ క్లియర్ చేసి జూనియర్ ఎన్టీఆర్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి చంద్రబాబు పాచికలు వేస్తున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications